Guntur Kaaram: తెలుగు చలనచిత్ర రంగంలో ఈ సంక్రాంతి పండుగకు అతిపెద్ద సినిమాగా రిలీజ్ అయింది “గుంటూరు కారం”. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తారీకు విడుదల కావడం జరిగింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. విడుదలైన తర్వాత ఈ సినిమా మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ తో విజయవంతమైన కలెక్షన్ లు రాబడుతుంది. విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹94 కోట్ల క్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఒక రీజనల్ రేంజ్ సినిమా ఈ స్థాయిలో వసూలు రాబట్టడం ఇదే ఫస్ట్ టైం. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ “గుంటూరు కారం” సినిమాపై మంచి ట్వీట్ చేయడం జరిగింది. షారుక్ ఈ ట్వీట్ లో… నా స్నేహితుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చూడటానికి ఎదురు చూస్తున్నాను. ఒక మంచి ఎమోషన్ యాక్షన్ మాస్ సినిమా అని షారుక్ తెలియజేస్తూ ట్రైలర్ కూడా షేర్ చేయడం జరిగింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ బాలీవుడ్ బాద్షా.. షారుక్ తమ హీరో సినిమా గురించి పోస్ట్ చేశారంట ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఏడాది షారుక్ నటించిన “జవాన్” సినిమా విడుదలైన సమయంలో మహేష్.. పొగడ్తలతో ముంచెత్తారు. అసలు సిసలైన షారుక్ కనబడుతున్నారని మాకు ఇదే కావాలి సినిమా గురించి పోస్ట్ పెట్టడం జరిగింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” భారీ అంచనాల మధ్య విడుదల అయింది. గతంలో వీరు కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. రెండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. రెండు సినిమాలలో మహేష్ బాబుని త్రివిక్రమ్ చాలా కొత్తగా చూపించారు. ఈ క్రమంలో మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో… 12 సంవత్సరాల తర్వాత “గుంటూరు కారం” రావడం జరిగింది. దీంతో కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వస్తున్నట్లు సినిమా యూనిట్ తెలియజేస్తోంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!