= దక్కించుకోవాలన్న ఆరాటంలో భాగంగా పార్టీలు ఉచితాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే.. ఈ ఉచితాల విషయంలో ప్రజలు మునుపటి మాదిరిగా అయితే లేరు. తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో అయితే.. పరిస్థితి చాలా బిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉచిత పథకాల హామీలు లెక్కకు మించి ఇచ్చినా.. లేదా.. అతి చేసినా ప్రజలు గమనిస్తు న్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా దీనిపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం విరివిగా పథకాలు అమలు చేస్తోంది. దీనివల్ల.. అప్పులు పెరిగిపోయాయనే వాదన ఉండనే ఉంది. అదేసమయంలో ఎక్కడా అభివృద్ది కనిపించడం లేదు. అదేమని అడిగితే.. అప్పులు తెచ్చిన సొమ్ము అక్షరాలా.. 2 లక్షల కోట్లపైచిలుకు మొత్తాలను ప్రజలకు పంచినట్టు చెబుతున్నారు.
అంటే.. ఉచిత హామీలు వర్కువట్ అయినా.. అధికారంలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నా.. తర్వాత మాత్రం ప్రభుత్వాలు ఇబ్బంది పడక తప్పడం లేదు. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు.. దక్షిణాది లోని నాలుగు రాష్ట్రాలు ఉచిత పథకాలకు ప్రజలను బాగా అలవాటు చేశాయనే వాదన కూడా ఉంది. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే.. దీని వల్ల ఇతర స్వయం ఉపాధి రంగాలైన ఆటో, రిక్షా, క్యాబ్ వంటివి దెబ్బతిన్నాయి.
ఇక, ఏపీ, తమిళనాడుల్లో అమలు చేస్తున్న పథకాల కారణంగా.. అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలపై పడింది. దీంతో అసలు ఉచిత పథకాల అవసరమా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఉచిత పథకాలు ప్రకటించే పార్టీల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పని సరిపరిస్థితి వచ్చిందనేది మేధావుల మాట. తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలోనూ మేధావులు ఇదే అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆచితూచి ఉచితాల వైపు మొగ్గు చూపాలని వారు సూచించారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!