అమరావతి: వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణతో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్మూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు. చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందే పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవికి రాజీనామా చేసి టిడిపి నుండి వైసిపిలో చేరారు. రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 14వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. వైసిపి సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో ఈ మూడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలకనేతలతో జగన్ సంప్రదింపులు జరిపి ఖరారు చేశారు. నామినేషన్ల దాఖలు అనంతరం వీరి ఎన్నిక లాంఛన ప్రాయమే.
previous post
next post