విశాఖ: సీనియర్ టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టిడిపి అధ్యక్షుడు సన్నాసిపాత్రుడు పార్టీకి రాజీనామా చేశారు. నారా లోకేష్ నర్సీపట్నంలో పర్యటనలో ఉండగానే సన్యాసిపాత్రుడు రాజీనామాతో షాక్ ఇవ్వడం గమనార్హం, సన్యాసినాయుడుతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా టిడిపికి రాజీనామా చేసినట్లు సమాచారం. పది మంది స్థానిక నేతలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సన్యాసినాయుడు ఏ పార్టీలో చేరిది త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో నారా లోకేష్ పాల్గొంటున్న తరుణంలో సన్యాసిపాత్రుడు తన వర్గీయులతో పార్టీకి షాక్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.