అమరావతి: లూలూ కంపెనీకి ఏపి బైబై అంటే తెలంగాణ వెల్కమ్ అందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.శనివారం వరుస ట్వీట్లతో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపిలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామని కంపెనీలు ప్రకటిస్తున్నా సిగ్గురావడం లేదా అని బుద్దా ప్రశ్నించారు. ‘ప్రపంచ స్థాయిలో మాల్ని నగరం నడిబొడ్డున కాకపోతే మీ బొడ్డులోనూ, మీ ఇంటి దొడ్డిలోనూ నిర్మిస్తారా? లేక జనసంచారం లేని జగన్ గారి ఇడుపులపాయి ఎస్టేట్లో నిర్మిస్తారా?’ అని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
విజయసాయిరెడ్డి అపర మేధావితనానికి జోహార్లు అంటూ లూలూకి కేటాయించిన భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందనీ, త్వరలో బయటపడుతుందనీ మంగళవారం మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలని ఆయన కోరారు
ప్రభుత్వ భూములను కారు చౌకగా సూట్ కేస్ కంపెనీలకు అమ్మేస్తున్నందుకు తమరు మళ్లీ కొత్త కేసుల్లో బోనులో నిలబడాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయింటూ బుద్దా వ్యాఖ్యానించారు.
వైసిపి ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే జగన్ టిడిపి ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. 22 మంది ఎంపిలను అనుమానిస్తున్న జగన్కు అసలు ప్రమాదం మీరే అన్న విషయం ఇంకా అర్థమైనట్లు లేదని అన్నారు. ‘అసలు కోవర్టు మీరు అని తెలుసునే లోపే జగన్ గారిని జైలుకి పంపి మీరు సీటు కొట్టేయాలని ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు ఎవరికీ తెలియదు అనుకోవడం పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లే ఉంది విజయసాయిరెడ్డి గారూ’ అంటూ ట్విట్ చేశారు.
అప్పడాలు, నీళ్ల ప్యాకెట్లపై చంద్రబాబు ఫోటో వేసుకోలేదా అందుకే తాము జాతీయ జండాకి, జాతిపిత గాంధీ తాతకి వైసిపి రంగులు వేస్తున్నామని విజయసాయి అనడం వింతగా ఉందని బుద్దా అన్నారు. అప్పడాలు, నీళ్ల ప్యాకెట్లతో జాతీయ జండాని, గాంధీ తాతని పోలుస్తూ అవమానిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తమరిపై దేశద్రోహం కేసు తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో దేశద్రోహం కేసు కూడా నమోదవుతుందని బుద్దా అన్నారు. తిరుమల గుడిని నీ అమ్మ మొగుడు కట్టాడా అని వైసిపి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే వారు ఎంత అధికారమదంతో ఉన్నారో ప్రజలకు అర్థం అవుతోందని బుద్దా విమర్శించారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!