కడప: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అమరావతి రాజధానిలో చెప్పులు వేయడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి అన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని ఆనాడే తాను చెప్పానని తులసిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక, రౌడీరాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. మంత్రులు, నేతలు, కార్యకర్తలు బూతులు మాట్లాడటం హేయమని ఆయన పేర్కొన్నారు. ఈ రౌడీ రాజ్యం ఎక్కువ రోజులు సాగదని అన్నారు. ప్రజలు తిరగబడితే రౌడీలు పలాయనం చిత్తగించక తప్పదని తులసిరెడ్డి అన్నారు.
previous post
next post