కులం లేదు, మతం లేదు మానవులు అంతా ఒక్కటే..సమ సమాజ నిర్మాణానికి బాటలు వేద్దాం అంటూ సినిమాలు వచ్చాయి. ఇప్పటీకే చాలా ప్రాంతాల్లో ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా కులాంతర, మతాంతర వివాహాలను చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ కులాంతర వివాహాలకు పెద్ద ఎత్తున నగదు ప్రోత్సహకాలను అందితున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఛాందసవాదులు కులకట్టు బాట్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. పరువు, ప్రతిష్టలు అంటూ ఎంతకైనా తెగిస్తున్నారు.
తాజాగా తమిళనాడులోని చిదంబరంలో ఓ పరువు హత్య వెలుగు చూసింది. తన ప్రియురాలిని చూడటానికి వెళ్ళిన యువకుడిని ఆమె ఇంట్లో దారుణంగా హత్య చేశారు.
అన్భళగన్ అనే యువకుడు చిదంబరం అరంగనాథన్ వీధి లో ఉన్న బాబు కుమార్తె శ్వేత తో ప్రేమలో పడ్డాడు. ఏడాదిన్నర కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రియురాల్ని చూడలేని పరిస్థితుల్లో పడ్డ ఆ యవకుడు గత నెల ఆమె ఇంటి వద్దకు వెళ్లిగా శ్వేత కుటుంబీకులు గమనించి తీవ్రంగా మందలించి పంపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రియురాలి ఇంట్లో ఎవరు లేరన్న సమాచారంతో అతను మళ్ళీ వెళ్లి బుక్కయ్యాడు. మందలించినా సరే మళ్ళీ మళ్ళీ వస్తావా అంటూ ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు కలిసి అతడిని పట్టుకుని తీవ్రంగా దాడి చేశారు.దీంతో అన్భళగన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమ పరువు తీస్తున్నాడన్న కోపంతోనే తాము అతడిని హత్య చేశామని ఆ కుటుంబం ఓ లేఖను ఇంట్లో ఉంచి పరారైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం లభించిన లేఖ ఆధారంగా ఇది ప్రేమ పరువు హత్యగా గుర్తించారు.