ఈ మధ్య కాలంలో విశాఖ జిల్లాలోని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.మాట్లాడితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా అనేస్తున్నారు.
ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది .నిజానికి విశాఖలో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన చిరకాల కోరికగా మంత్రి పదవిని అందుకున్నారు. పైగా ఆయన అయిదేళ్ళు మంత్రిగా కొనసాగాలనుకుంటున్నారు. అంతే కాదు, విశాఖ వంటి పెద్ద జిల్లాకు ఏకైకమంత్రిగా కూడా శాసించాలనుకుంటున్నారు. అటువంటి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య తరచూ సవాళ్ళు చేస్తున్నారు. అది కూడా తన మంత్రి పదవి మీదనే చేస్తున్నారు. అలా ఎందుకు అవంతి శ్రీనివాస్ చేస్తున్నారన్న దానిపై విశ్లేషణగా సవాళ్ళతో, చంద్రబాబు మీద విమర్శలతో తన పదవిని నిలబెట్టుకునే ఎత్తుగడలకు మంత్రి పాల్పడుతున్నారని సొంత పార్టీలో వినిపిస్తున్న మాట.వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో భూ కబ్జాలు పెరిగాయని, గజం స్థలానికి కూడా గ్యారంటీ లేదని చంద్రబాబు నుంచి మాజీటిడిపి మంత్రుల వరకు అందరూ ఆరోపిస్తుండగా విశాఖలో ఒక్క గజం స్థలంలో భూకబ్జా జరిగిందని నిరూపించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హూంకరిస్తున్నారు. అనాలని టీడీపీ అంటూంటే మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలా సవాళ్ళు చేస్తున్నా కూడా అవంతి శ్రీనివాస్ ని ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ నేతలు కానీ సీరియస్ గా తీసుకోకపోవడమే ఇక్కడ కామెడీ.ఎటూ రెండేళ్ల తరువాత మంత్రి పదవి పోతుందని, ఇంతలో రంకెలు ఎందుకు అని వారు సెటైర్లు వేస్తున్నారు. అయితే జగన్ వద్ద ఇవేమీ సాగవని, పనితీరు ఆధారంగానే ఆయన పదవులు ఇస్తారని, ఇలా షార్ట్ కట్ మెథడ్స్. అవుట్ డేటెడ్ రాజకీయాలతో మంత్రిపదవి కొనసాగింపునకు గ్యారంటీ ఇవ్వరని కూడా సొంత పార్టీ వారేచెబుతున్నారు. మొత్తమే అవంతి శ్రీనివాస్ వ్యవహారం విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదమైన చర్చలకు తావిస్తోంది