చాలావరకు రాజకీయాలలో వైయస్ జగన్ వ్యవహారశైలి మాట ఇస్తే మడమతిప్పని నైజమని చెబుతుంటారు. అదే విధంగా ప్రజలకు ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తీసుకునే కుటుంబం వైయస్ కుటుంబం కాదని చాలామంది అంటుంటారు. ఇదే టైమ్ లో ఎప్పుడు వైయస్ జగన్ కూడా విశ్వసనీయత నాయకుడిపై ప్రజలకు ఉండాలని అబద్ధాలు చెప్పి గెలిచే అలవాటు తనకు లేదని చాలాసార్లు చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి అలవాటు నాకు ఉండి ఉంటే 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ అనే అసాధ్యం హామీ ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యే వాడిని అని గతంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ మాట్లాడటం జరిగింది.
ఇటువంటి వ్యవహార శైలి కలిగిన వైఎస్ జగన్ తాజాగా శాసన మండలి రద్దు చేయాలని భావించి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే శాసన మండలి రద్దు అనే కీలక విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్లు అర్థమవుతుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మెజార్టీ లో ఉండటంతో చాలా బిల్లులు అడ్డుకోవడం జరిగింది.
దీంతో పెద్దల సభ అంటూ సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్న శాసన మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీ కి మరియు అధికార పార్టీ వైసిపికి తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో వైసిపి పార్టీకి పూర్తి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో… ఆఖరి నిమిషంలో ఇటీవల శాసన మండలి రద్దు విషయంలో వైఎస్ జగన్ పునరాలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది.