తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన అమృత భర్త ప్రణయ్ హత్య కేసు గురించి తెలిసిందే. ఈ అంశాన్నే కథగా మలచి రామ్ గోపాల్ వర్మ మర్డర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందలో అమృత పాత్రలో అవంచ సాహితి అనే అమ్మాయి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ లో సాహితి, ఏడాది వయసున్న బిడ్డను ఎత్తుకుని ఉంది.
కళ్లలో ఆవేదన, తండ్రి లేడని తెలీని బిడ్డతో ఆమె అమృత పాత్రలో ఒదిగిపోయింది. వాస్తవ కథలతో తెరకెక్కే సినిమాలు మెయిన్ కథాంశం పక్కకు వెళ్లకూడదు. వర్మ ఎన్నో రియల్ స్టోరీలను ఇదే పద్ధతిలో తీసాడు. తీసిన ప్రతి సినిమాలో రియల్ వ్యక్తులను పోలిన నటులనే తీసుకుంటాడు. అందులో ఆయన నేర్పరి. పోస్టర్ తోనే సంచలనం రేపిన వర్మ సినిమాను మరెంత సంచలనం చేస్తాడో చూడాల్సిందే.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!