టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సినిమాటోగ్రాఫర్స్ గా అన్నదమ్ములిద్దరు మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. చెప్పాలంటే మా సినిమాకి కెమెరామాన్ ఇతనే కావాలి అని స్టార్ హీరోలు, దర్శకులు పట్టు పట్టేంత క్రేజ్ ని పొందారు. ఇద్దరు బ్లాక్ బస్టర్ సినిమాలకి పనిచేశారు. అంతేకాదు కావాల్సినంత చెడ్డ పేరును నెత్తిమీద పెట్టుకున్నారు. అన్న కి హీరోయిన్స్ అంటే మోజు మామూలుగా ఉండదు. పబ్లిక్ ఫంక్షన్ అని కూడా చూడకుండా హీరోయిన్ ని కౌగిలించుకొని ముద్దు పెట్టేస్తాడు. సీనియ కెమెరామాన్ అయుండి కెమెరాలున్నాయని కూడా ఆలోచించడు.
ఇక తమ్ముడైతే అన్ననే మించిపోయాడు. ఏకంగా 5 ఏళ్ళు సహజీవనమే చేశాడట. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ సినిమాలకి పనిచేస్తూ బెస్ట్ కెమెరమాన్ అని పేరు తెచ్చుకున్నా అది ఒకే ఒక్క దెబ్బకి నాశనం అయింది. సాయి సుధ అనే నటిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి 5 ఏళ్ళుగా వాడుకుంటున్నాడని ఆ అమ్మాయి ఇటీవల కేసు పెట్టింది. దాంతో పోలీసులు తీసుకెళ్ళి లోపల వేస్తే రెండే రెండు రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు.
ఇద్దరం రాజీకొచ్చామంటూ దొంగ పత్రాలు సృష్ఠించి కొర్టు కళ్ళు గప్పి బయటపడ్డాడు. అయితే ఈ విషయం ఎన్నో రోజులు దాగలేదు. మళ్ళీ ఊచలు లెక్కపెట్టెందుకు సాయి సుధ ఇచ్చిన షాక్ తో దిమ్మ తిరిగింది. అయితే ఇప్పుడు ఇతని వల్ల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనవసరంగా నిందలు పడుతున్నాడట. శ్యాం కె నాయుడు అంటే పూరి కెమెరా మాన్ కదా అంటూ ముందు పూరి పేరు ప్రస్తావనకి తీసుకు వస్తున్నారట. మంచి టెక్నీషియన్ అని వరసగా భారీ ప్రాజెక్ట్ కి అవకాశాలిస్తే అది కాస్త పూరి కే చుట్టుకుందని అంటున్నారు. మొత్తానికి ఈ అయ్యగారు అమ్మాయిని మోసం చేయడమే కాదు అవకాశం ఇచ్చి ఈ స్థాయికి తీసుకు వచ్చిన దర్శకుడికి చెడ్డ పేరు తెచ్చాడు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!