Ambati Rayudu: వైసీపీకి ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితమే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తిరుపతి రాయుడు ఆకస్మికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో రకరకాలుగా వదంతులు వ్యాపించాయి. వాస్తవానికి గుంటూరు పార్లమెంట్ నుండి ఆయన పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే నరసరావుపేట లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచించిన నేపథ్యంలో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేశారని భావిస్తున్నారు.
అయితే తాజాగా తన రాజీనామాకు గల కారణాన్ని పరోక్షంగా వెల్లడించారు అంబటి రాయుడు. మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించారు. వృత్తిపరమైన క్రీడను అడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు అంబటి రాయుడు. త్వరలో దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ టీ 20 లీగ్ లో ఆడనున్నట్లు తెలియజేశారు. ఇంటర్నేషనల్ లీగ్ లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తో జతకట్టనున్నారు. రాయుడు గతంలో ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ కు ఆడారు. ఇంటర్నేషనల్ టీ 20 లీగ్ జనవరి 20 నుండి ప్రారంభంకానున్నది.
Rajya Sabha Election 2024: రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ ..? సంక్రాంతి తర్వాత నిర్ణయం
I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport.
— ATR (@RayuduAmbati) January 7, 2024