NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. మరో రెండున్నర దశాబ్దాలు ఉచిత విద్యుత్ కు ఢోకా లేదు

YS Jagan: రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం వైఎస్ జగన్. సబ్ స్టేషన్ లు లేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాలు తీరనున్నాయన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో మొదటి సారి ఒకే సారి 28 సబ్ స్టేషన్లకు ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్దతిలో 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేయడంతో పాటు 12 సబ్ స్టేషన్ లకు ప్రారంభోత్సవాలు చేశారు. అలానే కడపలో 750 మెగావాట్లు సామర్ధ్యం, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు సీఎం జగన్.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవేళ ప్రారంభించిన సబ్ స్టేషన్ లను స్థానికులకే అంకితం చేస్తున్నామన్నారు. రైతులకు పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయంచామని తెలిపారు.  14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. గోదావరి వరదల సమయంలో చింతూరు, వీఆర్ పురం, ఏటపాక తదితర ముంపు ప్రాంతాల్లో ఇటీవల తాను పర్యటించిన సమయంలో సబ్ స్టేషన్ లు లేకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు ప్రజలు తెలియజేశారన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ అక్కడి సబ్ స్టేషన్ లను ఈరోజు ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు.

ట్సాన్స్ మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామంలోని రైతులకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నామన్నారు.రూ.1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్ స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4 లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. మరో రెండున్నర దశాబ్దాల పాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సీఎం వివరించారు.  దాదాపు రూ.3099 కోట్లు సబ్ స్టేషన్ ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవన్ కు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. సోలార్ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు.

BRS MLA Candidate: బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కామెంట్స్..సాదుకుంటారా..? చంపుకుంటారా ..? మీయిష్టం..!

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju