NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: వారి కోసం ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు

Share

CM YS Jagan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో అనేక మంది మన దేశ పౌరులు చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. వారిలో దాదాపు 50 మందికి పైగా తెలుగు వారు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సుడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్.

CM YS Jagan

 

ఉక్రెయిన్‌సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్‌ చేసుకుని స్వస్థలాలకు చేరుకునే వరకూ అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సుడాన్‌లో 56 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు.


Share

Related posts

YSRCP: ఈ సారి జగన్ ను నమ్ముకుంటే కష్టమే..? కొంపముంచుతున్న నేషనల్ సర్వే రిజల్స్..??

somaraju sharma

Rajamouli: బాహుబలి 3 గురించి నోరు జారిన జక్కన్న!

Ram

షర్మిల పార్టీ నిజమేంత! వైఎస్ కుటుంబం నుంచి ఖండన ఏది??

Comrade CHE