NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి  – జలవనరుల సంరక్షణపై అంతర్జాతీయ సద్సస్సులో సీఎం జగన్

CM YS Jagan: విశాఖ రుషికొండలోని రాడిసన్ హోటల్ నందు జలవనరుల సంరక్షణపై వారం రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు (25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీ)ని కేంద్ర జలశక్తి మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం అనే థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు విడతల రజిని, గుడివాడ అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు భారత్ నుండి 300 మంది, అస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుండి 900 మందికిపైగా ప్రతినిధులు హజరయ్యారు.

ఈ సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంపై అంతర్జాతీయ  సదస్సు ఇక్కడ జరగడం శుభపరిణామం అని అన్నారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ప్రభుత్వం సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరుచూ కరువు వస్తొందన్నారు. వర్షం కురిసేది తక్కువ కాలమేనని, ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలని అన్నారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని సీం జగన్ పేర్కొన్నారు.  

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇరిగేషన్ పై ప్రత్యేకంగా పోకస్ పెడుతున్నామని వివరించారు. ప్రపంచ దేశాలకు భారత్ అతి పెద్ద ఎగుమతిదారుడుగా వృద్ది చెందుతోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తామని చెపారు. మోడీ నేతృత్వంలో రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్తు తరాలకు ఉపయోగమన్నారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నామన్నారు.

తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు షెకావత్. 2019 లో మోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించామని చెప్పారు. జలశక్తి అభియాన్ తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్, మద్య ప్రదేశ్ లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. డ్యామ్ సెఫ్టీ యాక్ట్ ల ద్వారా డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్ లను పరిరక్షిస్తున్నామని వివరించారు. ప్రపంచ బ్యాంక్ సహకారంతో డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందని షెకావత్ తెలిపారు.

IT Rides: హైదరాబాద్ లో మరో సారి ఐటీ సోదాల కలకలం .. కాంగ్రెస్ నేతల్లో గుబులు

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?