AP Govt: ఏపిలో విద్యుత్ వినియోగదారులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రంగాలకు విద్యుత్ కోతలను ప్రభుత్వం ఎత్తివేసింది. నూరు శాతం విద్యుత్ ను సరఫరా చేయాలని ఆదేశించింది. బొగ్గు నిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో పాటు విద్యుత్ వినియోగం తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Govt: నూరు శాతం విద్యుత్ వినియోగానికి అనమతి
గత నెలలో తీవ్ర బొగ్గు కొరత కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడంతో పాటు గృహ అవసరాల విద్యుత్ కు కోతలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు బొగ్గు నిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో అన్ని రకాల పరిశ్రమలు, ఫుడ్ ప్రాసిసింగ్, కోల్డ్ స్టోరేజ్ తదితరాలకూ నూరు శాతం విద్యుత్ వినియోగదానికి అనుమతి ఇచ్చారు. విద్యుత్ కోతలు ఎత్తివేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read More: Breaking: గ్రీన్ కార్డులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడ జోబైడెన్.