Breaking: గ్రీన్ కార్డుల జారీపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆరు నెలల్లో గ్రీన్ కార్డు ధరఖాస్తులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అమెరికన్ గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయుల కల త్వరలో తీరబోతున్నది. భారతీయ అమెరికన్ అజయ్ జైన్ భుటోరియా గ్రీన్ కార్డు జారీ ప్రక్రియను అరు నెలల్లో పూర్తి చేయడంపై ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేశారు. జనాభా పెరిగినా..అమెరికా వీసా విధానంలో మార్పులు రాలేదనీ తెలియజేస్తూ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించుకుని నిర్ణయాలు వేగంగా వెలువడేలా అవసరమైన చోట్ల మార్పులు చేయాలని అజయ్ జైన్ అమెరికా పౌరసత్వ వలసదారుల సేవల సంస్థ (యూఎన్సీఇఎస్)కు సిఫార్సు చేశారు. గ్రీన్ కార్డు వీసా ఇంటర్వ్యూలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అందుకోసం అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వానికి అజయ్ జైన్ ప్రతిపాదించారు. కమిటీ నివేదికపై జో బైడెన్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Breaking: భారతీయ ఐటీ నిపుణులకు లబ్ది
అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు అనుమతిస్తూ ఆ ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డు. హెచ్ 1 బీ వీసాలపై అమెరికా వెళ్లే ఐటీ నిపుణులు ఈ గ్రీన్ కార్డు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక్కో దేశానికి ఏడు శాతం మాత్రమే గ్రీన్ కార్డులు ఇవ్వాలన్న నిబంధన సహా ప్రస్తుతం ఉన్న వీసా విధానం దీనికి ఇబ్బందికరంగా మారింది. దీంతో కొందరు గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన వస్తోంది. ఇప్పుడు అజయ్ జైన్ కమిటీ సిఫార్సులపై అధ్యక్షుడు జో బైడెన్ సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ది చేకూరనుంది.