AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత కోర్టుల్లో అనుకూల ఉత్తర్వులు రాకపోవడంపై న్యాయ వ్యవస్థపై కొందరు టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు చేశారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో క్రిమినల్ కంటెంట్ పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులపై, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారనీ, తీర్పులపై విమర్శలు చేశారని వివరించారు.
దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. టీడీపీ నేతలు, సానుభూతిపరులు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ నేత బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అలానే ట్రోల్స్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది.
CM YS Jagan: ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే 175/175 అసెంబ్లీ స్థానాలు సాధ్యమే – సీఎం వైఎస్ జగన్