ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కి తన పేషీ సిబ్బంది షాక్ ఇచ్చారు. ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ విధులకు గైర్హజరు అయ్యారు. గత ఏడాది డిసెంబర్ నుండి జీతాలు రాలేదంటూ సచివాలయంలోని మినిస్టర్ చాంబర్ కు తాళం వేసి నిరసన తెలిపారు సిబ్బంది. మంత్రి, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పలితం లేకుండా పోయిందని వారు వాపోయారు. జీతాలు చెల్లించే వరకూ తాళాలు తీసేది లేదని వారు తేల్చి చెప్పారు.
జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలంటూ నిరసన తెలిపారు. తమ జీతాలు రాకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మినిస్టర్ చాంబర్ కు తాళం వేసిన సిబ్బంది అనంతరం విధులకు గైర్హజరు అయ్యారు. మరో పక్క మంత్రి పేషీకి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు మంత్రి ఛాంబర్ కు తాళాలు వేసి ఉండటంతో వెనుతిరిగారు.
జగన్ నోటి వెంట కొత్త మాట .. నడ్డా, షా వచ్చి వెళ్లిన తర్వాత..