Big Breaking : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , భారతి దంపతులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.. గుంటూరు భారత్ పేట 104 వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ చేశారు.. అనంతరం అరగంట పాటు సీఎం దంపతులిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.. కమ్యూనిటీ హాల్ లో ఆయన స్వయంగా వ్యాక్సిన్ వేయించుకుని.. 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు, గ్రామ సచివాలయం లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..
తరువాత ఆయన సచివాలయం, వైద్య సిబ్బంది తో సమావేశం అవ్వనున్నారు. ఆ తరువాత గుంటూరు నుంచి బయలుదేరి తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:50 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటలకు విజయవాడలో ఏ- కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.