Breaking: ఏపిలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్ విద్యార్ధులకు వారు చదువుతున్న కాలేజీలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని పెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీసుకువస్తూ ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ల పై విచారణ సందర్భంలో ఒకే కళాశాలలో చదువుకున్న విద్యార్ధులు వేర్వేరు కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హజరు కావాల్సి ఉంటుందని పిటిషన్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. దీంతో పాత విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అయితే హైకోర్టు తీర్పుపై ఇంటర్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళుతుందా లేక హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాత విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి.