వైఎస్ఆర్ షాదీ తోఫా అమలులో ఏపీ సర్కార్ కీలక మార్పులు చేసింది. రాష్ట్రంలోని నూర్ బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇక పై వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ప్రభుత్వం లక్ష రూపాయలు అర్ధిక సాయం అందించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు జగన్ సర్కార్ వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తొంది. ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్ బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తును బీసీ – బీ గా పరిగణిస్తున్నందున వారికి రూ.50వేలు మాత్రమే ఆర్ధిక సాయంగా అందుతోంది.
ఈ నేపథ్యంలో తాము కూడా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నందున వైఎస్ఆర్ షాదీ తోఫా కింద లక్ష చొప్పున ఆర్ధిక సాయం మంజూరు చేయాలని దూదేకుల ప్రతినిధులు రీసెంట్ గా సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా వీరిని ముస్లింలుగానే పరిగణించి లబ్దిని చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రభుత్వం వైఎస్ఆర్ షాధీ తోఫా అమలులో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుని సర్క్యులర్ జారీ చేసింది.
Janasena: ఎన్డీఏ కీలక సమావేశానికి జనసేనకు అహ్వానం ..టీడీపీకి షాక్.. ట్విస్ట్ ఏమిటంటే ..?