Chiranjeevi: ఏపిలో సినిమా టికెట్ల అంశానికి సంబంధించి వివాదం పీక్స్ కి చేరిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ వాళ్లను వైసీపీ నేతలు, వైసీపీ నేతలను సినీ పరిశ్రమ వాళ్లు విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్లుగా నడుస్తోంది. ఈ తరుణంలో మెగా స్టార్ చిరంజీవి నేడు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అవుతున్నారు. ఇంతకు ముందు ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకువస్తూ సినిమా టికెట్ల ధరలను తగ్గించిన సందర్భంలో చిరంజీవి స్పందించారు. ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకురావడాన్ని స్వాగతించిన చిరంజీవి.. టికెట్ల ధర విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మంత్రి పేర్ని నానితో భేటీ అయి చర్చించారు. ఇంత వరకూ సినీ ప్రముఖులకు సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించలేదు.
ఈ నేపథ్యంలో చిరంజీవి నేడు జగన్ తో లంఛ్ మీటింగ్ కన్ఫర్మ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చిరంజీవి.. జగన్మోహనరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నేతగా వ్యతిరేకిస్తున్నా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్వాగతిస్తూ జగన్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరినా లభించలేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకస్మాత్తుగా సీఎం జగన్ తో చిరు లంచ్ మీటింగ్ జరుగుతుండటం అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
Read More: RRR: చంద్రబాబుకు పెద్ద పరీక్ష పెడుతున్న రఘురామ కృష్ణం రాజు? ఊ అనలేడు .. ఊఊ అనలేడు..!!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!