CM YS Jagan: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసనహం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.
CM YS Jagan: అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ సీరియస్
ఈ సమావేశంలో టీడీఎల్పీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచి పద్దతి కాదంటూ అచ్చెన్నాయుడుకి హితవు పలికారు సీఎం జగన్. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని సంగతిని సీఎం జగన్ గుర్తు చేశారు. గవర్నర్ వయసులో పెద్దవారనీ, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా జగన్ అన్నారు.
కాగా ఈ నెల 25వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 13 రోజల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.