AP Cabinet Meeting: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తొలుత దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఏపి కేబినెట్ సంతాపం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించింది. 35 అజెండా అంశాలపై ఏపి కేబినెట్ లో చర్చించారు.
AP Cabinet Meeting: కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే..
- ఏపి అధికార భాషా చట్టం 1966 సవరణ
- రెండవ భాషగా ఉర్దూ
- విదేశీ మద్యం నియంత్రణ చట్టం సవరణ
- నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
- మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణంకోసం రూ.8741 కోట్ల రుణ సమీకరణకు ఏపి మారిటైమ్ బోర్డుకు హామీ ఉండేందుకు కేబినెట్ ఆమోదం
- ఖాయిలా పడిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్చంద ఉద్యోగ విరమణ అంశం
- మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్ల వ్యయం
- టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హింధూ ధార్మిక సంస్థల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.