Machilipatnam (Krishna): జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో చాలా చోట్ల భూముల ధరలు ప్రభుత్వం నిర్దేశిత రేటుకు, మార్కేట్ రేటుకు 40 నుంచి 50 శాతం వ్యత్యాసం ఉందని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉన్నప్పుడు ఆదాయం ఎందుకు పెంచుకోకూడదని ప్రశ్నించారు.
కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన విషయాలతో పాటు గన్నవరంకు చెందిన భూముల విషయమై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ రవీంద్రనాథ్, జిల్లా రిజిస్టర్ విఎస్ఆర్ ప్రసాద్, గన్నవరం సబ్ రిజిస్టర్ కే. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.