టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న గత 23 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే తారకరత్న మృతి పై తెలుగు అకాడమి చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్న ను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారనీ తీవ్ర ఆరోపణలు చేశారు.
తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్న లక్ష్మీపార్వతి.. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్న ను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణ వార్త ప్రకటించి ఉండాలన్నారు.
ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారన్నారు. తండ్రీ కొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసునన్నారు. తారకరత్న భార్య, బిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. నీచమైన రాజకీయాలు చేయడం మానివేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని లక్ష్మీపార్వతి కామెంట్స్ చేశారు. లక్ష్మీపార్వతి మాట్లాడిన వీడియో వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
రాజకీయంగా వైరుద్యం ఉన్నప్పటికీ తారకరత్న సతీమణికి దగ్గరి బంధువు అయిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఘటనపై ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేయకపోయినా లక్ష్మీపార్వతి ఈ విధంగా సంచలన కామెంట్స్ చేయడంపై నందమూరి, నారా కుటుంబం మీద వ్యక్తిగతంగా ఉన్న కోపంతో చేశారని అంటున్నారు. నందమూరి తారకరత్న నారా లోకేష్ కుప్పం నుండి చేపట్టిన యువగళం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొని గుండె పోటుతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఆయనను కుప్పంలోని ఓ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
తారకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు.. విజయసాయిరెడ్డి తో చంద్రబాబు
కొడుకు పాదయాత్ర కి మచ్చ రాకుండా ఉండేందుకు మరీ ఇంత నీచ రాజకీయం చేయాలా చంద్రబాబు…?#NaraHanthakuduCBN #TDPYamaGalam pic.twitter.com/nyk7JJXjAU
— YSR Congress Party (@YSRCParty) February 19, 2023