నారా లోకేష్. టీడీపీ యువనాయకుడిగానే కాకుండా.. పట్టువదలని నాయకుడిగా.. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం నుంచే ఇప్పుడు కూడా పోటీలో ఉన్నారు. అదే మంగళగిరి. ఈసారి ఖచ్చితం గా ఇక్కడ నుంచి విజయం దక్కించుకోవడం ఖాయమని ఆయన అంచనా వేసుకున్నారు. అయినప్పటి కీ.. క్షేత్రస్థాయిలో పర్యటనను ముమ్మరం చేశారు. అయితే.. ఇప్పుడు గత 15 రోజులుగా నారా లోకేష్ క్లాస్ జనాలను కలుస్తున్నారు.
అయితే.. గతంలో మాస్ను టార్గెట్ చేసిన నారా లోకేష్.. ఇప్పుడు క్లాస్ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి పరిధిలోని క్లాస్ పీపుల్ను ఆయన కలుస్తున్నారు. అపార్టు మెం టు వాసులతో మమేకం అవుతున్నారు. ఇటీవల కాలంలో మంగళగిరిలో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత.. అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఇక్కడ 2015-19 మధ్య అపార్ట్మెంట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి.
దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి స్తిర నివాసం ఏర్పరుచుకున్నా రు. వీరికి.. చంద్రబాబు హయాంలో మేలు జరిగిందన్న బావన ఉంది. దీంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పా టు చేసుకున్న అపార్ట్మెంటు వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత చంద్రబాబు పాలనను ప్రస్తుత జగన్ మోహనరెడ్డి పాలనను ఆయన వివరిస్తున్నారు. ఇక, రాష్ట్ర భవిష్య త్తు, ఐటీ కంపెనీల రాక, పెట్టుబడులు వంటి కీలక విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్లాస్ ఓటర్లు నారా లోకేష్కు అనుకూలంగానే ఉన్నారని టీడీపీ నాయకులు చెబుతున్నా రు. వీరి ఓటు గుండుగుత్తగా టీడీపీకే పడుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. మంగళగిరిలో మాస్ జనాలు క్యూ కట్టి మరీ ఓటు వేసినట్టుగా క్లాస్ జనాలు వేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూలేదు. పైగా ఠారెత్తిపోతున్న ఎండలు కావడంతో ఎంత వరకు క్లాస్ జనాలు తరలి వస్తారనేది చూడాలి. వీరి ఓటు కనీసం 40 – 50 శాతం పడినా నారా లోకేష్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనేది టీడీపీ అంచనా.