Delhi Liquor Scam Case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి (రాఘవ)కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అనారోగ్య కారణాలపై రాఘవకు నాలుగు వారాల పాటు న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించకపోవడం గమనార్హం. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో దాన్ని ఈడీ వ్యతిరేకించడంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
అయితే ఇవేళ మాగుంట రాఘవ బెయిల్ ను ఈడీ వ్యతిరేకించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాఘవను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సౌత్ గ్రూప్లో రాఘవ కీలక పాత్రధారిగా ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. మరోపక్క ఈడీ కేసులో దినేష్ అరోరా త్వరలో అప్రవర్గా మారనున్నారు. అరోరా గతంలోనే సీబీఐ కేసులో అప్రూవర్గా మారారు. ఈ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా తో పాటు మరి కొందరికి బెయిల్ లభించలేదు.
YSRCP: త్వరలో ఆ సీనియర్ బీసీ నేతకు కీలక పదవి ..?