NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : అమ్మ నిమ్మగడ్డా .. నువ్వు మామూలోడివి కాదు , జగన్ ని ఇలా ఇరికించావా ?

Nimmagadda : రాష్ట్రంలో ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైఎస్ జగన్ YS Jagan ప్రభుత్వం మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు తరచు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే నిమ్మగడ్డ మాత్రం సైలెంట్ గా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిమ్మగడ్డ లోని ఆంతర్యం హైకోర్టు న్యాయమూర్తి కూడా గ్రహించినట్లు ఉన్నారు. అందుకే ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నారు. అసలు ఎస్ఈసీ ఉద్దేశం ఏమిటంటూ హైకోర్టు న్యాయమూర్తి నిలదీయడం అందరిన ఆశ్చర్యానికి గురి చేసింది. కోర్టు దిక్కార పిటిషన్ ను ప్రచారం కోసం దాఖలు చేస్తున్నారా అంటూ హైకోర్టు సోమవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నిలదీసింది. గత నెల 18వ తేదీన కోర్టు దిక్కార పిటిషన్ 42 రోజుల పాటు ధర్మాసనం ముందు విచారణకు రాలేదనీ అయితే పిటిషన్ లో ప్రతి అక్షరం మాత్రం ఆ మరుసటి రోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైందని దీంతో పిటిషన్ వేసిన ప్రయోజనం నెరవేరినట్లు కమిషనర్ భావించినట్లు ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Nimmagadda : sec nimmgadda strategy on YS jagan
Nimmagadda : sec nimmgadda strategy on YS jagan

అసలు వివరాల్లోకి వెళితే..ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదనీ, నిధులు విడుదల చేసేలా అదేశాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు అందించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ గత ఏడాది ఎస్ఈసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన  న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రభుత్వం ఎస్ఈసీకి అన్ని విధాలుగా సహయ సహకారాలు అందించాలంటూ గత ఏడాది నవంబర్ మూడవ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదని దీనిని కోర్టు దిక్కారంగా పరిగణించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది డిసెంబర్ 18న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 29న విచారణకు వచ్చింది.

అందులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేసేందుకు కమిషన్ తరపు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా న్యాయమూర్తి తనకు కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ ను ఆదేశించారు. డిసెంబర్ 18న పిటిషన్ వేస్తే అది జనవరి 29వ తేదీ వరకూ ఎందుకు విచారణకు రాలేదు. ఇన్నిరోజుల జాప్యం మీ తప్పా, రిజిస్ట్రీ తప్పా అని ప్రశ్నించారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశామనీ, ఫోన్లు కూడా చేశాననీ న్యాయవాది అశ్వనీకుమార్ సమాధానమిచ్చారు.

Nimmagadda : sec nimmgadda strategy on YS jagan
Nimmagadda : sec nimmgadda strategy on YS jagan

Nimmagadda : 42 రోజులు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ?

అత్యవసరం లేదని బావించే 42 రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. నిజంగా అత్యవసరమని భావిస్తే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారని ఆ పని చేయలేదంటే ఎస్ఈసీ ఏ ప్రయోజనం ఆశించి కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేశారో అర్థం అవుతోందన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటేనే ప్రతిపాదుల పై ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు అభిప్రాయపడుతుందన్నారు. ఇన్ని రోజులు ఓ పిటిషన్ విచారణకు రాకపోవడం అంటే ఈ కోర్టు రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని న్యాయమూర్తి అన్నారు. అందుకు బాధ్యులైన అధికారులపైనా కోర్టు దిక్కార చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అదే విధంగా కోర్టు దిక్కార పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. పిటిషన్ విచారణకు రాకముందే వాటిని పత్రికలకు ఇవ్వడం సరికాదనీ, ఈ విషయంలో కమిషనర్ కు తగిన సలహా ఇవ్వాలని కూడా కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ కు న్యాయమూర్తి సూచించారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju