Ys Jagan Mohan Reddy : vishakapatnam విశాఖ పట్టణాన్ని పాలన capital రాజధాని గా చేయాలని వైసిపి పార్టీ నేతలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో విపక్షాల నుండి న్యాయపరమైన చిక్కులు ఉన్నాగాని కేంద్రం నుండి తాజాగా విశాఖ రాజధాని విషయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే విశాఖ పాలన రాజధానిగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సుముఖంగానే ఉన్నట్లు పొలిటికల్ టాక్. విషయం ఏమిటంటే ఇటీవల విశాఖను ఆర్థిక రాజధానిగా గుర్తించేలా జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు 15వ ఆర్థిక సంఘం ఆమోదించడం జరిగిందట. విశాఖను రాజధానిగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయటం 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ విషయంలో కేంద్రానికి ఒక అవగాహన వచ్చినట్లే అనే టాక్ పరిశీలకుల నుండి వస్తుంది. ఇదే తరుణంలో అమరావతి అనేది శాసన రాజధాని తప్ప ఆర్థిక రాజధాని కాదు అనేది కేంద్రం కూడా ఒప్పుకున్నట్లు తాజా పరిణామంపై అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ అభివృద్ధికి 1400 కోట్ల రూపాయలు నిధులు నేను ఆర్థిక సంఘం నుండి సాధించడంతో చాలా వరకు విశాఖ కి రాజధాని కళ వచ్చినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామంతో అమరావతి రాజధానిగా గుర్తించాలని చూస్తున్నాం పార్టీలకు ఊహించని షాక్ అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో విశాఖ కి పాలన రాజధాని విషయంలో కేంద్రం నుండి జగన్ సర్కార్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అని పొలిటికల్ విశ్లేషకుల టాక్.