నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఇటీవల వైసీపీ బహిష్కరించడంతో ఆయన టీడీపీకి దగ్గర అయిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రంలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, నెల్లూరు జిల్లాలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆనం కుటుంబం నుండే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు టీడీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఇవేళ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంకు వచ్చిన ఆనం జయకుమార్ కి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. జయకుమార్ రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన మరో సోదరుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి జయకుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమైయ్యారు. విజయకుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ దగ్గర అయిన తరుణంలో ఆయన సోదరుడు జయకుమార్ రెడ్డి వైసీపీలో చేరడం నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గతంలో జయకుమార్ రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి కారణంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. నేడు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!