తమిళనాడు సీఎం స్టాలిన్ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న సీఎం స్టాలిన్ ఇవేళ చెన్నై క్రిమ్స్ రోడ్డు వద్దనున్న అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సీఎం స్టాలిన్ ఆసుపత్రిలో చేరిన అంశంపై అపోలో ఆసుపత్రి వర్గాలు పత్రికా ప్రకటన విడుదల చేశాయి. సీఎం స్టాలిన్ రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. ఆయనకు సాధారణ ఎండో స్కోపీ పరీక్షలు నిర్వహించి రేపు (మంగళవారం) డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు తెలిపారు.
నారా లోకేష్ కు మంత్రి విడదల రజిని సవాల్ .. ఆరోగ్య శ్రీపై చర్చకు సిద్దమా..?