TDP YCP: వైసీీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్, టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. నారా లోకేష్ పై అనిల్ కుమార్ విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రులను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలనను జగన్మోహనరెడ్డి అందిస్తుంటే నారా లోకేష్ లోకజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు అనిల్.
- Read the latest news from
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP YCP: టీడీపీ నేతల చీకటి రాజకీయాలు
జిల్లాలోని టీడీపీ నాయకులు చీకటి రాజకీయాలు చేస్తున్నారనీ, టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను నిరూపిస్తానని సవాల్ చేశారు. నారా లోకేష్ సవాల్ ను స్వీకరిస్తారా అని అనిల్ ప్రశ్నించారు. తనపై 200 కోట్లు దోచుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తాను దోచుకోలేదని కాణిపాకం వినాయకుడి పై ప్రమాణం చేస్తాననీ అన్నారు. వారికి దమ్ముంటే ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. కొందరు టీడీపీ నాయకులు వైసీపీ నేతలతో కుమ్మక్కు అయి చీకటి వ్యవహారాలు నడిపిస్తున్నారని అనిల్ ఆరోపణలు చేయడంతో ఆ నాయకులు ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే అనిల్ విమర్శలపై టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రియాక్ట్ అయి ట్విట్టర్ వేదికగా మరో సవాల్ విసిరారు.
టచ్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ..
కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్ లో ఉన్నారంటూ కాలవ శ్రీనివాసులు బాంబ్ వేశారు. అందులో రోజు నీతో (అనిల్) మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని పేర్కొన్న కాలవ శ్రీనివాసులు..ప్రతి రోజు నిన్ను (అనిల్) నీ పార్టీ (వైసీపీ)ని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే ఉన్నారన్నారు కాలవ. దమ్ముంటే నువ్వు మీ జగన్ రెడ్డి గారికి చెప్పి సస్పెండ్ చేయించు అ నిల్లు అని కాలవ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి కామెంట్స్ తో వైసీపీతో లాలూచీ వ్యవహారాలు చేస్తున్న టీడీపీ నేతలు ఎవరు..టీడీపీతో టచ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి ఎవరు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.