Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఒఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి తనను ఈ కేసు నుండి తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సీబీఐ కోర్టు గత నెల 17న కొట్టేసింది. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ముందుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు చేపట్టరాదంటూ సీబీఐ కోర్టును ఆదేశించారు. దీంతో గత నెల చివరి వారంలో శ్రీలక్ష్మి మినహా ఇతర నిందితులపై సీబీఐ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. తాజాగా శ్రీలక్ష్మి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. ఆ కేసులో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను సీబీఐ కోర్టుకు అందించలేకపోయింది, కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.
కాగా ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలు లో ఉన్నారు. 2004 నుండి 2009 వరకూ శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ కేసులో బీవి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్థనరెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు మైఫజ్ ఆలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు. వీరిపై ఇప్పటికే సీబీఐ కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
AP Police: ఏపిలో భారీగా డీఎస్పీల బదిలీలు