Vyooham: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల29వ తేదీన వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. హైకోర్టులో పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపించారు.
వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతో రూపొందించారన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేమ్ చేసే విధంగా సినిమా తీశారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారనీ, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతున్నామని మురళీధర రావు పేర్కొన్నారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుందన్నారు. ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ పేరుతో డీ ఫేమ్ కు పాల్పడటం సరికాదనీ, దానికి కూడా ఒక హద్దు ఉంటుందని అన్నారు.
వ్యూహం సినిమాకు నిర్మాత రామదూత క్రియేషన్స్ అని, ప్రొడ్యూసర్ అడ్రస్ కూడా వైసీపీకి చెందిన కార్యాలయం పేరిటే ఉందని మురళీధర్ రావు కోర్టుకు వివరించారు. బహిరంగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకు ఇష్టంలేదని ఈ సినిమా ప్రీ రిలీజ్ లో ఆర్జీవీ చెప్పారన్నారు. వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబును కించపరచడానికే తీశారన్నారు. ఈ సినిమా ఫంక్షన్ లకు సైతం వైసీపీ మంత్రులు హజరయ్యారని, సినిమా ట్రైలర్, పాటలను పెన్ డ్రైవ్ లో కోర్టుకు లోకేష్ న్యాయవాది సమర్పించారు. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 28వ తేదీన చేపడతామని హైకోర్టు తెలిపింది.
CM YS Jagan: ఆడుదాం ఆంధ్రా దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం వైఎస్ జగన్
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!