CM YS Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలో జరిగే ఈ క్రీడలతో వ్యాయామం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంత అవసరమో తెలుస్తుందని జగన్ అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బీపీ, షుగర్ లు కంట్రోల్ లో ఉంటాయన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం – ఆంధ్రా క్రీడాపోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
సచివాలయ స్థాయి నుండి మండల స్థాయికి, మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయికి.. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకూ అంటే 47 రోజులపాటు ఊరూరా పండుగలా ఈ పోటీలు జరుగుతాయని సీఎం చెప్పారు. ప్రతి ఏడాది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. గ్రామాల్లో ఆణిముత్యాలను వెలికి తీసి అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో ప్రముఖ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్ భాగస్వామ్యులవుతున్నామన్నారు. గ్రామ స్థాయి క్రీడాకారులను తీర్చి దిద్దడంలో వీరు సహాయ పడతారన్నారు.
గ్రామ సచివాలయ స్థాయి నుంచే స్పోర్ట్స్ కిట్స్ ను అందిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆట స్థలాలను ఏర్పాటు చేసుకుని క్రీడలను ప్రోత్సహిస్తామని జగన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తేనే ఏపీలో క్రీడల పట్ల ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్ధమవుతుందని అన్నారు. కోటి మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ క్రీడా సంబరం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఆడుదాం – ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. అనంతరం కొద్దిసేపు సీఎం జగన్ బ్యాటింగ్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బోలింగ్, మంత్రి రోజా కీపింగ్ చేసి క్రీడాకారులను అలరించారు.
TDP: టీడీపీ ఆశావహుల్లో కొత్త టెన్షన్ ..! ఇదెక్కడి సంస్కృతి అంటూ వాపోతున్న నేతలు..!!