NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SRIVARI TWIN BRAHMOTSAVAMS: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు .. కీలక నిర్ణయాలు వెల్లడించిన ఈఓ ధర్మారెడ్డి

SRIVARI TWIN BRAHMOTSAVAMS: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జ‌రిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని, భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

సెప్టెంబ‌రు 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. సీఎం చేతుల‌ మీదుగా శ్రీ‌నివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల హాస్ట‌ల్ భ‌వ‌నం, తిరుమ‌ల‌లో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌రకు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌ సేవ‌లు జ‌రుగుతాయ‌ని చెప్పారు. గ‌రుడ‌ సేవను రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభించి భ‌క్తులంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు.

ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు

సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, వారికి సంతృప్తిక‌రంగా వాహ‌న‌ సేవ‌ల ద‌ర్శ‌నంతో పాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని ఈఓ చెప్పారు. బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని, స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ ప్ర‌ముఖులను మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌దిత‌ర ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలను ర‌ద్దు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో ఆల‌యాలు నిర్మించిన‌ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లోని భ‌క్తుల‌కు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని తెలిపారు. వీరికి ఉచితంగా ర‌వాణా, భోజ‌నం, బ‌స క‌ల్పిస్తామ‌న్నారు.

భక్తుల భ‌ద్ర‌త దృష్ట్యా సెప్టెంబ‌రు 22న గ‌రుడ‌ సేవ నాడు ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ర‌వాణా, వైద్యం త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలియ‌జేశారు. బ్ర‌హ్మోత్స‌వాల కోసం విభాగాల వారీగా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. భ‌క్తుల కోసం ప‌లు ప్రాంతాల్లో జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగే ఉత్స‌వాల్లో తొమ్మిది రాష్ట్రాల నుండి క‌ళాకారుల‌ను ఆహ్వానించి వాహ‌న‌ సేవ‌ల ఎదుట క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఏనుగులు, అశ్వాలు, వృష‌భాలు ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో పాల్గొంటాయ‌ని, వీటి నిర్వ‌హ‌ణ కోసం కేర‌ళ నుండి నిపుణులను ర‌ప్పిస్తున్నామ‌ని చెప్పారు. అట‌వీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వ‌ర‌కు న‌డ‌క మార్గాల్లో ఇప్పుడున్న నిబంధ‌న‌లు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.

జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ గ‌తేడాది త‌ర‌హాలోని జిల్లాలోని అన్ని విభాగాల‌ను భాగ‌స్వాముల‌ను చేసి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తామ‌న్నారు. టీటీడీతో స‌మ‌న్వ‌యం కోసం న‌లుగురు అధికారుల‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేశామ‌ని, ఎక్సైజ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ట్యాక్సీల‌కు ధ‌ర‌లు నిర్ణ‌యించి స్టిక్క‌ర్లు అంటిస్తామ‌ని, రుయా ఆసుప‌త్రి, ఇత‌ర ప్రాంతాల నుండి వైద్యుల‌ను, మందుల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని వివ‌రించారు.

ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాలకు త‌గినంత మంది సిబ్బందితో పూర్తి భద్ర‌త క‌ల్పిస్తామ‌ని తెలిపారు. సీఎం ప‌ర్య‌ట‌న‌, గ‌రుడ సేవ‌, చ‌క్ర‌స్నానం రోజుల్లో ప్ర‌త్యేక భద్ర‌తా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యం, మాడ వీధులు, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఔట‌ర్ రింగ్ రోడ్డు, అలిపిరి చెక్ పాయింట్ త‌దిత‌ర ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. భ‌క్తుల ర‌ద్దీతో పాటు ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణకు ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు. తిరుప‌తి న‌గ‌రం శివార్ల‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహ‌నాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తామ‌న్నారు. తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి హ‌రిత మాట్లాడుతూ తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్‌, బ‌స్టాండు, భ‌క్తులు సంచ‌రించే అన్ని ప్రాంతాల్లో అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగ్గా పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

Tirumala: ఎస్వీ మ్యూజియానికి పురాత‌న వ‌స్తువులు అందజేత

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju