Tirumala: అమెరికాలో ఉంటున్న శ్రీమతి వింజమూరి సంధ్య తిరుమలలోని ఎస్వీ మ్యూజియానికి లక్షల రూపాయలు విలువ చేసే పురాతన వస్తువులను విరాళంగా అందజేశారు. వీటిని గురువారం తిరుమలలో ఈవో ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. వీరు టీటీడీ ఉత్సవాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు. అన్నమాచార్య ఉత్సవాలు ప్రారంభించిన నాటి నుండి ప్రముఖ సంగీత విద్వాంసులుగా ఉన్నారు.
వీరు శ్రీమతి ఎంఎస్.సుబ్బలక్ష్మి, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మతో కలిసి పనిచేశారు. వీరు ఉపయోగించిన, సేకరించిన వాటిలో తంబూరాలు, వేణువులు సంగీత పరికరాలతో, వారు పూజించిన పంచలోహ శ్రీ నమ్మాళ్వార్ విగ్రహం, చిన్న భగవద్గీత, వెండితో చేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల పటాలు, దంతపు నగిషీలు చెక్కిన కళాఖండాలు ఉన్నాయి. వీటిని ఆయన కుమార్తె శ్రీమతి సంధ్య మ్యూజియానికి అందజేశారు. మ్యూజియం అధికారి డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana Congress: మాజీ మంత్రి తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ భేటీ .. కాంగ్రెస్ లోకి ఆహ్వానం