YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమానంగా , ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను టార్గెట్ చేసిందనే టాక్ కూడా ఉంది. అదే సమయంలో నిమ్మగడ్డ సైతం అంతే దూకుడుగా స్పందిస్తున్నారు. ఇదే ఒరవడిలో తాజాగా నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆయన్ను అధికార పార్టీ ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన సమయంలో.
YS Jagan నిమ్మగడ్డ ఇరుక్కుపోయారా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ఇరువురు మంత్రులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రివిలేజ్ కమిటీ వర్చువల్గా చర్చించింది. కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్రెడ్డి అనంతరం మాట్లాడుతూ, ఈ నోటీసులపై యాయ నిపుణులతో కూడా మాట్లాడిన తర్వాత నోటీసులు పంపాలా లేదంటే మరో విధంగా ముందుకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నెల్లూరులోనే సంచలన వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ
అయితే, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్దన్ రెడ్డికి చెందిన నెల్లూరు జిల్లా పర్యటనలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల నిలుపుదలకు ఆఖరి వరకు ప్రయత్నించారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఎస్ఈసీ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయానిదే అంతిమ విజయమని తెలిపారు. ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందన్న ఆయన.. ఎన్నికలు జరిగితే గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయని.. అందుకే ఏకగ్రీవాలు అవసరం అనే వాదనను తాను అంగీకరించబోనన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకత ఉంటుందన్న ఎస్ఈసీ… తన పరిధిలో తాను బాధ్యతాయుతంగా పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. మొత్తంగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఇలాకాలోనే మరోమారు నిమ్మగడ్డ హాట్ కామెంట్లు చేయడం గమనార్హం.