Ys Jagan : గర్భిణీలకు వైద్య పరీక్షల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల సమయం వృధా కాకుండా పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వాలు ఉన్న సమయంలో పెన్షన్ కోసం అదేవిధంగా ప్రభుత్వ పనులు చేయించుకోవడం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ నేతల చుట్టూ తిరుగుతూ ఒకపక్క తమ దైనందిన జీవితంలో ఉద్యోగాలు మానుకొని సమయం వృధా చేసుకొని పరిస్థితి ఉండటమేగాక వృద్ధులు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కోకుండా గ్రామ వాలంటీర్లు అదేవిధంగా సచివాలయం ద్వారా నేరుగా పథకాలు ప్రజల ఇళ్లకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ డెలివరీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Ys Jagan : గర్భిణీల కోసం త్వరలో ఇంటివద్దకే
ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీ స్త్రీల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే గర్భిణీల కోసం త్వరలో ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాటు కి జగన్ సర్కార్ రెడీ అయ్యింది. అంతేకాకుండా వైద్య పరీక్షలు పూర్తయ్యేవరకూ వాహనం అక్కడే ఉంచి తిరిగి ఇంటి వద్దకు చేర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గర్భిణీ ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో అన్న దాని విషయంలో స్థానికంగా ఉండే ఆశ వర్కర్ కి అదేవిధంగా anm కి అవగాహన ఉండే పరిస్థితి అనుగుణంగా ఆ సమయానికి మెడికల్ ఆఫీసర్ కు ఫోన్ చేసి వాహనాన్ని ఇంటి వద్దకే పంపించడానికి జగన్ ప్రభుత్వం సరి కొత్త నిర్ణయాలు తాజాగా తీసుకున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాలి అని అనుకుంటున్నారో వారు ఇకపై ఆటో కోసం లేకపోతే బస్సు కోసం ఎదురుచూడాల్సిన పని ఉండదు.