పోలీసు పరిభాషలో ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెన్షన్ ఆఫ్ క్రైమ్ రెండు ఉంటాయి… ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ లో నేరం జరగక ముందే దాన్ని నిరోధించడానికి పోలీసులు తీసుకునే చర్యలు ఉంటే…, డి టెన్షన్ ఆఫ్ క్రైమ్ లో నేరం జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడానికి, నేరాన్ని నిరూపించడానికి వారు చేసే శోధన. ఒక నేరం జరిగినప్పుడు దాన్ని శాస్త్రోక్తంగా దర్యాప్తు చేయడం ఈ కేసులో భాగం అవుతుంది. ఇలా శోధనలో ఏపీ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. డిటెన్షన్ ఆఫ్ క్రైమ్ లో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఓ అరుదైన గౌరవం దక్కించుకుంది. నేరం జరిగిన తర్వాత దర్యాప్తులో కీలకమైన ఫింగర్ ప్రింట్ సేకరణలో.., దానిద్వారా నేర నిరూపణ లో ఆంధ్రప్రదేశ్ సీఐడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక కేసులు 512 ఫింగర్ ప్రింట్ విధానం ద్వారా నిరూపించి అగ్రభాగాన ఉన్నారు. మన తర్వాత కేరళ ఉంది.
ఏమిటి సేకరణ? ఎలా చేస్తారు..!?
నేరం జరిగిన తర్వాత నిందితులు ఎవరో తెలియక పోయినప్పుడు నేర స్థలంలో పోలీసులకు కీలకమైనవి ఫింగర్ ప్రింట్స్. హత్యలు, దొంగతనం కేసుల్లో ఎక్కువగా ఇవి చాలా కీలకం. అలాగే ఇతర నగరాల్లోనూ ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా పోలీసులకు ఉపకరిస్తాయి. ఫింగర్ ప్రింట్ లను పోలీసులు మూడు రకాలుగా చూస్తారు.
1. విజిబుల్ ఫింగర్ప్రింట్… ఇది కంటికి కనిపించేలా ఉంటుంది… నేరస్తుల రక్తం గాని, రంగు గాని గ్రీజ్ ఇతర పదార్థాలు చేతికి అంటుకుని నేరం జరిగిన సమయంలో అది నేర స్థలంలో పడి కంటికి కనిపించే లా ఉంటుంది.. దీన్ని పోలీసులు తగు పరిమాణంలో జాగ్రత్తలు తీసుకొని సేకరిస్తారు.. రసాయనాలు వాడుతూ వీడియోలు రికార్డ్ చేస్తూ దీన్ని సేకరిస్తారు.
2. ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్.. నేర స్థలంలో నిందితులు లేదా అనుమానితులు ఏదైనా పట్టుకున్నప్పుడు లేదా ఏ వస్తువునైనా ఉపయోగించి నేరం చేసే సమయంలో వారి చేతి ఫింగర్ప్రింట్ ఆయా స్థానాల్లో ఉండిపోతాయి.. వీటిని ఫింగర్ప్రింట్ నిపుణులు అత్యంత జాగ్రత్తగా సేకరించి నేర దర్యాప్తు ఉపయోగిస్తారు.. దర్యాప్తు అధికారి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.. నేర అనుమానితులుగా భావిస్తున్న వారి ఫింగర్ప్రింట్ కు ఇది మ్యాచ్ అయినప్పుడు సులభంగా నేరస్థులని పట్టుకోవచ్చు..
3. లేటెంట్ ప్రింట్… ఇది కేసులు అత్యంత కీలకమైంది.. నేర పరిశోధనలో ఎంతగానో ఉపకరించేది. న్యాయస్థానంలో శాస్త్రోక్తంగా కేసును నిరూపించే ది ఇదే.. నేర స్థలంలో నిందితుల వీర్యం, వెంట్రుకలు, లాలాజలం ఇతర అంశాల ఆధారంగా దీనిని సేకరిస్తారు. నిందితులు ఎవరో ఆచూకి తెలియనప్పుడు ఈ ప్రింట్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఆయేషా మీరా హత్య కేసులో ఇది పోలీసులకు ఒక దిశానిర్దేశం చేసింది. నేర స్థలంలో నిర్మించిన ఈ ఫ్రింట్స్ ఆధారంగా డిఎన్ఏ పరీక్షలు చేయవచ్చు నిందితులను కచ్చితంగా గుర్తించవచ్చు.
ఇలా చేసే కేసులు నిలుస్తాయి…!!
పోలీసులు కేసు నమోదు చేయడం గొప్ప కాదు.. దాన్ని కోర్టులో నిరూపించడం… నిందితుల తరుపున వాదించే లాయర్లకు కనీసం అభ్యంతరం పెట్టె అవకాశం లేకుండా కేసును శాస్త్రోక్తంగా దర్యాప్తు చేయడం, దానిలో సాక్ష్యాలను ఆధారాలను ఖచ్చితంగా ప్రవేశపెట్టడం పోలీసులకు పెద్ద పని. నేరాల రేటు లో పోలీసుల దర్యాప్తు కారణంగా శిక్ష పడుతుంది. దానిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెనుకబడే ఉన్నారు.. పోలీసులు నమోదు చేస్తున్న 100 కేసుల్లో 78 శాతం సరైన ఆధారాలు లేకుండా వీగిపోతున్నవే ఉంటున్నాయి.. ఫింగర్ ప్రింట్ ను శాస్త్రోక్తంగా సేకరించడం, దాని తర్వాత నిందితుల ఆచూకీ కనిపెట్టడం, వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం, వారికి శిక్ష పడేలా చేయడంలో ఫింగర్ప్రింట్ కీలకం అవుతాయి. ఫింగర్ ప్రింట్ ఆధారాలను కోర్టులు ఖచ్చితంగా నమ్ముతాయి.. వీటిని దర్యాప్తు అధికారి సరైన పద్ధతిలో సేకరించి కోర్టు లో ప్రవేశపెడితే నిందితులకు శిక్షలు పడే శాతం ఎక్కువ అవుతుంది.
అందుకే శెభాష్ సీఐడీ…!!
ఇన్నాళ్లు నేరాల శోధన బాగున్నా నిరూపణలో పోలీసులకు చిక్కులు ఎదురయ్యేవి. అందుకే ఈ ఫింగర్ ప్రింట్ విధానాన్ని ఏపీ సీఐడీ బాగా కీలకం చేసింది. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ సి ఐ డి దేశంలోనే ముందడుగు వేయడం శుభపరిణామం. సిఐడి డీజీగా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చురుకుగా పని చేస్తూ దర్యాప్తు వేగంగా నడిపిస్తున్నారు. ఏ మాత్రం అనుమానాలు ఉన్న సాంకేతిక విధానాల ద్వారా శోధన ఆరంభిస్తున్నారు. ఇదే తరహాలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం అనుసరిస్తే ఆంధ్రప్రదేశ్ లో జరిగే నేరాల్లో నేరస్తులకు శిక్ష పడే శాతం పెరుగుతుంది.