ఏపి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టింది.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి బిజెపి జనసేనలు ఎంత నీచానికి ఒడిగడతాయో ఆయన ప్రజలకు అద్దంలో చూపించాడు. ఇంతకాలంలో మన దేశంలో మతపరమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా బీజేపీనే ఉదహరించే వాళ్లు. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన జగన్ సర్కార్ను అంతర్వేది సంఘటన నేపథ్యంలో టార్గెట్ చేసి మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య విద్వేషాగ్నిని రగిల్చేందుకు పడిన తపన చూస్తే రాజకీయం ఇంత నీచమా అనే అభిప్రాయం కలగక మానదు.తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో గత శనివారం అర్ధరాత్రి దాటాక రథం దగ్ధమైంది.
ఈ రథం 40 అడుగుల ఎత్తు ఉంటుంది. సుమారు 60 ఏళ్ల క్రితం ఈ రథాన్ని టేకుతో తయారు చేశారు. లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ రథోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఎంతో పవిత్రంగా భావించే రథం అగ్నికి ఆహుతి కావడం ప్రతి ఒక్కర్నీ కలచివేసింది.అయితే అంతర్వేది జ్వాలలో ప్రతిపక్షాలు రాజకీయ చలిమంట కాచుకోవాలని … ఘటన జరిగినప్పటి నుంచి తీవ్రంగా యత్నిస్తూ వచ్చాయి. జగన్ పాలనలో హిందువుల మనోభావాలు పదేపదే దెబ్బతినేలా సంఘటనలు జరుగుతున్నాయంటూ బీజేపీకి మించి టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతుండడం ఆశ్చర్యంగా ఉంది.
జగన్ సర్కార్ను ప్రతిష్టను దెబ్బతీసి ఎలాగైనా రాజ కీయ లబ్ధి, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని స్పష్టంగానే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో అందరికీ ఒకే ఒక్క ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ లాగా ముఖ్యమంత్రి జగన్ అంతర్వేది సంఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించారు.ఈ దెబ్బతో ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ పైచేయి సాధించినట్టైంది.అసలు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్న సీబీఐతో అంతర్వేది ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు, లోకేశ్ డిమాండ్ చేయడాన్ని జనం జాగ్రత్తగా గమనిస్తున్నారు.
అలాగే ఏ మాత్రం అవకాశం చిక్కినా మతం ప్రాతిపదికన ప్రజల మధ్య విద్వేషాలను, విభజనను తీసుకొచ్చేందుకు జనసేన, బీజేపీలు వెనుకాడవని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇప్పటికే అర్థమైపోయింది. ఆయితే జగన్ ప్రతిపక్షాల ఎత్తులను, కుట్రలను చిత్తు చేస్తూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం నిజంగా ఓ సంచలనమే. జగన్ చర్యలతో ఇక ప్రతిపక్షాలు నోరు ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది.