బీజేపీ అంటే అంతే ఓటర్ల నిర్ణయంతో పని లేదు. తమకు ఎందుకు తక్కువ సీట్లు ఇచ్చారో అవసరం లేదు. తమకు సీఎం కుర్చీ ఎంత దూరంలో ఉంది..? ఎంత మంది కావాలి..? ఏం చేయాలి..? ఎవర్ని లాగెయ్యాలి…? కేంద్రంలో కుర్చీ ఉంది, రాష్ట్రాల్లో కుర్చీలు లాగేద్దాం. నాడు కర్ణాటకలో.. తర్వాత మధ్య ప్రదేశ్ లో జరిగింది అదే ఇప్పుడు రాజస్థాన్ లో జరుగున్నది అదే, భవిష్యత్తులో మహారాష్ట్రలో జరగనున్నది అదే. ఆ కుర్చీలాట.., సీట్లు ఆట…, ఎమ్మెల్యేలతో బంతాటలో బీజేపీ పెద్దలైనా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఆరితేరారు. తల పడిపోయారు.
సచిన్ కి ఏం కష్టమొచ్చిందో…!
కాంగ్రెస్ లో పూర్వ కాలపు కాంగ్రెస్ నేతలు తర్వాత జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన నేతలు ఉన్నారు అంటే అందులో సచిన్ పైలెట్ పేరు కచ్చితంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ సచిన్ కి ఏమైందో…? ఏం బేరం సెట్టయిందో..? ఏం హామీ లభించిందో..? బీజేపీ కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తనకు మద్దతుగా ఉన్న 25 మంది ఎమ్మెల్యేలతో జంపింగ్ కి రెడీ అయిపోయారు. అవ్వడం ఆలస్యం రాజస్థాన్ లో సీఎం కుర్చీ మారిపోతుంది. కాంగ్రెస్ దిగుతుంది. బీజేపీ ఎక్కుతుంది. 2014 నుండి ఇలా ఆకస్మికంగా కుర్చీలు మారిన రాష్ట్రాల్లో ఇది ఆరోది. ఇదే బీజేపీ తరహా రాజకీయం అంటే.
కాంగ్రెస్ కి ఇక దిక్కేది…!!
కాంగ్రెస్ కి ఇంకేం దిక్కు లేదు. చాల రాష్ట్రాల్లో చేవ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. పేపర్ పై బలంగా కనిపించే నాయకులున్నారు. మైకుల ముందు స్పీచ్ దంచగల లీడర్లున్నారు. కానీ దిక్కు, దిక్సూచి లేదు. నడిపించే నాయకత్వం లేదు. బీజేపీ లో మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కునే సత్తా ఉన్న నాయకత్వం లేదు. చిలిపి, చిన్న పాటి రాహుల్ లో ఆ కన్నింగ్ లేదు. నానమ్మ, తండ్రి తరహా… కనీసం తల్లి లా కూడా రాజకీయం ఇంకా రాహుల్ ఒంటికి పట్టలేదు.
ప్రియాంక గాంధీ పట్ల శ్రేణులు ఆశలు పెట్టుకున్నా ఆమె కూడా పూర్తిస్థాయిలో దిగడం లేదు. ఇటు మోడీ, షా ద్వారం దూసుకెళ్తుంది. వారికి కేంద్రంలో పగ్గాలు వస్తే చాలు, రాష్ట్రాల్లో వచ్చేసినాతె అనే వ్యూహంతో కదులుతున్నారు. “పెళ్లి కుదిరితే రోగం తగ్గుతుంది అని డాక్టర్ అంటే…, రోగం తగ్గితేనే పెళ్లి కుడుతుంది అని పేషేంట్ అన్నట్టుగా”… “కాంగ్రెస్ కి ఇప్పుడు బలం రావాలి అంటే అధికారం రావాలి…! అధికారం రావాలి అంటే బలం రావాలి. ..!!