మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకున్నట్లే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కొద్దిసేపటి క్రితం సుప్రీం కోర్టులో జరిగిన కీలక విచారణలో వైయస్ జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్ వారి వాదనను సమర్థించింది.
నిమ్మగడ్డ కే సుప్రీం సపోర్టు
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఇక ఆ విషయం పై తదుపరి వాదన అనవసరం అని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ తో కలిసి సహకరిస్తూ ఎన్నికల నిర్వహణ విజయవంతం అయ్యేలాగా చూడాలి. అయితే మొదటి నుండి సుప్రీంకోర్టు విచారణ పై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. ఎలాగైనా నిమ్మగడ్డ ఇందులో విజయం సాధిస్తారని అందరూ ముందు నుంచి అనుకుంటున్న విషయమే.
మధ్యలో మీరెందుకు వచ్చారు
అయితే మధ్యలో ఉద్యోగ సంఘాలు తలదూర్చిన విషయమై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వ్యవస్థల మధ్య ఎటువంటి కీలకమైన విషయం చోటు చేసుకుంటున్న సమయంలో లో మీరు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రవర్తించడం అసలు బాగోలేదు అని చెప్పేసింది. అసలు ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముందని… మీరు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టు దగ్గర నుండి తీవ్రమైన కోటింగ్ తీసుకున్న తర్వాత కూడా ఎలక్షన్ విధులు నిర్వహించకుండా ఉండే అవకాశం కూడా ఉంది.
వీళ్ళు కాకపోతే వారు…
అందుకని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కు సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చేత తాము నిర్వహించే అధికారం ఇవ్వాలని అలాగే తమకు సపోర్ట్ చేయాలని నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాయనున్నారట. మరి ఏపీ ఉద్యోగులు కోర్టువారు చెప్పిన మాటను అనుసరించి నిమ్మగడ్డకు సహకరిస్తారా…. లేదా చరిత్రలో తొలిసారి ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో నిర్వహిస్తారా అన్నది వేచి చూడాలి.