సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతోంది. ఏకంగా బిజెపి పెద్దన్న అమిత్ షా కే ఈ విషయమై సిబిఐ ఎంక్వైరీ కొరకు ఆదేశాలు జారీ చేయమని డిమాండ్ లు పెరిగిపోతుండగా… సుశాంత్ ఆత్మహత్యలో తాజాగా జాతీయ మీడియా లో ఒక కొత్త కోణం బయటికి వచ్చింది. అది ఏంటంటే ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అందించిన సమాచారం మేరకు సుశాంత్ ఒకే నెలలో 50 సార్లు తన ఫోన్ సిమ్ కార్డ్ ను మార్చాడు అని చెప్పారు. ప్రతీ సారీ వేరే వేరే సిమ్ కార్డ్ ను వేసేవాడట.
ఇంకా ఇల్లు సీల్ చేయకపోవడం ఏంటి..?
అయితే ఇప్పటివరకు సుశాంత్ సింగ్ ఇంటిని పోలీసులు ఎందుకు సీల్ చేయలేదు అనే ప్రశ్నకు మాత్రం పోలీసు వారి వద్ద నుండి సమాధానం లేదు. అంతటి సెలబ్రిటీ చనిపోయినా…. ఇంటిని సీజ్ చేయకపోతే అది ఒకవేళ ఆత్మహత్య కాకుండా హత్య అయితే ఎవరైనా వెళ్లి ఆధారాలను ప్రభావితం చేసే లేదా తారుమారు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ ను నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే సుశాంత్ ఇలా 50 సిం కార్డులను వాడాడు అని చెబుతున్న శేఖర్ కపూర్ పోలీసులు అతని ఇంటిని సీజ్ చేసి బాగా తనిఖీ చేస్తే ఖచ్చితంగా అవి దొరుకుతాయి అని కూడా నమ్మకంగా కూడాచెబుతున్నారు.
సీసీ కెమెరాల విషయం పట్టించుకోరా?
ఇదిలా ఉండగా అసలు సుశాంత్ ఇంటిముందు సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు..? అని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముందంతా బాగా పని చేస్తున్న కెమెరాలు సుశాంత్ చనిపోయే రోజు ఉదయాన్నే పాడైపోవడం ఏమిటి..? అసలు దీనిపై విచారణా కరిపే ఉద్దేశం ఉన్నట్లా.. లేనట్లా..? అలాగే ఇప్పటి వరకూ అతను ఇంటికి ఎందుకు సీజ్ చేయలేదు అని ప్రముఖ నటి బాలీవుడ్ క్వీన్ రనౌత్ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇదే సమయంలో ఈ ఒత్తిళ్ల మధ్య పోలీసులు సుశాంత్ మొబైల్లో వేసిన ఈ సిమ్ కార్డుల విషయమై మరొక రూపంలో ట్రేసింగ్ చేయడం మొదలుపెడితే వారికి కూడా ఈ 50 కార్డులకు సంబంధించి గట్టి ఇన్ఫర్మేషన్ లభించిందని వార్త బయటకు వచ్చింది.
ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తున్నారు…!
ఇకపోతే ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి హీరోయిన్లు రియా చక్రవర్తి, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, సంఘీ వంటి పలువురు ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 38 మందిని విచారించగా శేఖర్ కపూర్ సిమ్ కార్డుల విషయాన్ని చెప్పినట్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!