తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్…. చంద్రబాబు బినామీలంటేనే వైసీపీ పెద్దలు తీవ్రమైన ఆరోపణలు చేసిన వారంతా ఇప్పుడు అదే బినామీల పై ఎక్కడ దేని గౌరవాన్ని చూపిస్తున్నారు. ఏంటి నమ్మరా..? మరి మీరే చదవండి అయితే….
మీకు వద్దా.. అయితే మాకు ముద్దు
గతంలో డిమానిటైజేషన్ సమయంలో కొత్త నోట్లతో దొరికిపోయిన శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని వైసీపీ…. లోకేష్ బినామీ అని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు చంద్రబాబు ఆయనను టిటిడి బోర్డు నుండి తప్పించారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే అతనికి టిటిడి బోర్డు పదవి వచ్చేసింది. గతంలో చేసిన ఆరోపణలు అన్నీ ఒక్కసారిగా మరచిపోయింది. అంతేకాదు నెల్లూరు జిల్లాలో అత్యంత విలువైన సిలికా గనుల తవ్వకాన్ని శేఖర్ రెడ్డి కి సంబంధించిన కంపెనీకు దక్కాయి. దక్కాయి అనడం కంటే…. దక్కేలా చేశారు అని అంటే మరింత సమంజసంగా ఉంటుంది.
ఒక్కడి కోసం 80 మందికి టోకరా….
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా…. గట్టిగా మాట్లాడితే దక్షిణ భారతదేశంలోనే నాణ్యమైన ఖనిజం నెల్లూరు జిల్లాలో లభిస్తుంది. కానీ ఇప్పటివరకు ఆ తవ్వకాన్ని 80 వరకు చిన్న చిన్న కంపెనీలు లీజుకు తీసుకొని ఉన్నాయి. అయితే కొత్త ప్రభుత్వం రాగానే తమదైన శైలిలో లీజుల స్థానంలో టెండర్ల విధానం తీసుకువచ్చారు. 200 రూపాయల ధరను నిర్ణయించారు. అవంతిక సంస్థ 212 రూపాయలు ఇచ్చేందుకు టెండర్ వేసింది. ఎక్కువే ఇచ్చింది కదా అని పైకి అనిపిస్తుంది కానీ ఆ టెండర్లలో ఇప్పటి వరకూమైనింగ్ చేసుకున్న కంపెనీలకు పాల్గొనే అవకాశం లభించలేదు. అదే కదా ఇక్కడ మ్యాజిక్. దానికి కారణంగా టెండర్లలో పాల్గొనే కంపెనీలకు రూ. 507 కోట్ల మైనింగ్ టర్నోవర్ ఉండాలి అర్హతగా పెట్టారు. అంతే… ఒకే ఒక సంస్థ కోసం మిగతా వాటిని అన్నింటిని చాలా విచిత్రమైన కారణంతో ఎలిమినేట్ చేసి పారేశారు.
ఏపీ కి తీసుకొచ్చి…. సంపద చేతిలో పెట్టి…
ఇదిలా ఉంటే మన శేఖర్ రెడ్డి కి తమిళనాడులో ఇసుక కింగ్ అనే పేరు ఉంది. ఏ మైనింగ్ వ్యాపారం చేసినా అది తమిళం అడిగే పరిమితం. అయితే ఏ రోజైతే లోకేష్ బినామీ గా పేరు తెచ్చుకున్నారో…. అప్పుడు ఏపీ లోకి ఎంటర్ అయ్యారు అని చెబుతుంటారు. వ్యాపారులను 80 మందిని సైడ్ చేశాడు కానీ ఈసారి లోకేష్ బినామీగా శేఖర్ రెడ్డి పై ఆరోపణలు చేసిన వారు అతనికి అండగా ఉన్నారు . ఎంత తవ్వుతున్నాడో…. ఎంత తరలిస్తున్నాడో అన్నది ఆ దేవుడికే తెలియాలి. ఇక గత ప్రభుత్వంలో అధికార పార్టీ బినామీ అని చెప్పిన అతనిని ఈ ప్రభుత్వం వారు వచ్చి నువ్వు బినామీ కాదు మంచి వ్యాపారవేత్త.. ప్రభుత్వానికి లాభదాయకం గా ఉంటావు అని చెప్పి అర్హతలతో సంబంధం లేకుండా అవకాశాలు ఇవ్వడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.