Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ కానున్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వెండి తెరపై కనిపిస్తూ ఉండటంతో.. అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రాజకీయాలలో మూడు సంవత్సరాలు ఫుల్ బిజీగా ఉన్నా పవన్ కొద్ది కాలం గ్యాప్ తర్వాత “వకిల్ సాబ్” సినిమా రాగా అదేసమయంలో కరోనా వైరస్ రావడంతో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు పెద్దగా హడావుడి లేకుండా పోయింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం బయట వాతావరణం చాలా అనుకూలంగా ఉండటంతో “బీమ్లా నాయక్” సినిమాకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి 21వ తారీకు సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో “బీమ్లా నాయక్” థియేట్రికల్ ట్రైలర్ కూడా 21వ తారీకు రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. అయితే ట్రైలర్ రన్ టైం నిడివి చూస్తే దాదాపు రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్స్ అంట. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ రానా నటిస్తూ ఉండటంతో థియేట్రికల్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని పవన్ అభిమానులు.. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. “బీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ బయట ఓ రేంజ్ లో ఆదరణ దక్కించుకోవడంతో థియేట్రికల్ ట్రైలర్ తో సరికొత్త రికార్డులు సృష్టించడానికి పవన్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అదేవిధంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తూ ఉండటంతో సినిమా టికెట్లు ఇవ్వాలని కి సంబంధించి ఎటువంటి కామెంట్లు వస్తాయో అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీకి 60శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వస్తున్నట్లు ఇటీవలె ఏపీ సీఎం జగన్.. టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయిన సమయంలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా వేడుకకు తెలంగాణ మంత్రులు హాజరు కావడం అటు ఇండస్ట్రీ ఇటు రాజకీయంగా ఈ వేడుకను ఆసక్తిగా గమనిస్తున్నారు.