Director Teja: తెలుగు చలనచిత్ర రంగంలో చాలామంది నూతన నటీనటులను పరిచయం చేసిన దర్శకుడు తేజ. మనోడు పరిచయం చేసిన వారిలో ఉదయ్ కిరణ్, నితిన్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించారు. ఎన్నో వైవిధ్యమైన మరియు కమర్షియల్ సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఎప్పుడు కూడా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం గల మనిషి. ప్రేమ కథ చిత్రాలపై తనదైన మార్క్ చూపించిన దర్శకుడు. అటువంటి డైరెక్టర్ తేజ దర్శకత్వంలో “అహింస” అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ తేజ మాట్లాడుతూ తన కెరియర్ లో మొత్తంగా చూసుకుంటే పెద్ద హీరోలతో మీరు సినిమాలు చేయలేదు. చేద్దామని నేను ఎవరిని కూడా అడగలేదు. ఇంతవరకు చేస్తూ వచ్చిన సినిమాల్లో నాకు షేర్ ఉండేది. బాగా త్వరలోనే పూర్తిగా నిర్మాతగా కూడా మారబోతున్నాను. కొత్త దర్శకులకు మరియు హీరోలకు అవకాశాలు ఇస్తాను అని తెలియజేశారు. అంతేకాకుండా తన కొడుకుని హీరోగా కూడా పరిచయం చేయాలనుకుంటున్నది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫారెన్ లో అందుకు సంబంధించి కోర్సులు చేసి రెడీగా ఉన్నాడు. చూడటానికి హ్యాండ్సం గానే ఉంటాడు. అయితే హ్యాండ్సమ్ ఉండగానే సరిపోదు. నటన తెలియాలి… తనకంటూ ఒక స్టైల్ ఉండాలి… అప్పుడే హీరోగా నిలబడతాడు.
మా అబ్బాయి సినిమాను నేను డైరెక్ట్ చేయాలా…? వేరే వారికి అప్పగించాలా..? అనేది ఇంకా ఆలోచించలేదు అంటూ డైరెక్టర్ తేజ స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో డబ్బులు కోసం సినిమా చేయడం తన అలవాటు లేదని చెప్పుకొచ్చారు. దర్శకుడిగా దాదాపు 70 సినిమాలను వదిలేసుకున్నాను. నచ్చని చోట పని చేయటం మొదటి నుంచి తనకి ఇష్టం లేదని తెలిపారు. డబ్బుల కోసం సినిమా తీయననీ.. మూవీ తీసే ప్రాసెస్ మాత్రమే ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇంకా “అహింస” సినిమా ఆలస్యం అవడానికి కారణం హీరో అభిరామ్ గాయపడటమే అని అన్నారు.