నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని ‘కథానాయకుడు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎందరో స్టార్లు నటించిన ఈ సినిమాని, మరెందరో స్టార్స్ చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. డబ్బులు రాబట్టడంలో కాస్త వెనకంజలో ఉన్న ఎన్టీఆర్ సినిమా, కాంప్లిమెంట్స్ మాత్రం బాగానే రాబట్టింది. అయితే ఈ సినిమాని చూసి ప్రశంసించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లేడు. బాబాయ్ తప్ప, తాత సినిమా ఎవరూ చేయలేరని కథానాయకుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన ఎన్టీఆర్, ఇప్పుడు మహానాయకుడు సినిమా రిలీజైనా కూడా అదే మౌనం పాటిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ వర్గాలు సపోర్ట్ చేస్తుంటే తారక్ మాత్రం తాత సినిమాకి సపోర్ట్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఎన్టీఆర్ బయోపిక్ గురించి తారక్ కనీసం కళ్యాణ్ రామ్ నటించిన 118 ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో అయినా మాట్లాడుతాడనుకుంటే మరోసారి మౌనం పాటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడని అందుకే బయోపిక్ చూసి ఉండడేమోనని ఎవరికి వారు సర్ది చెప్పుకుంటున్నారు కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే మరీ తారక్ అంత బిజీగా ఏమి లేడు. ట్రిపుల్ ఆర్ మూడో షెడ్యూల్ మొదలయ్యే వరకు ఎన్టీఆర్ దగ్గర కావాల్సినంత టైమ్ ఉంది. అసలు తారక్, ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు సినిమాలని చూశాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. అయితే తారక్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలని చూశాడు కానీ అతనికి నచ్చలేదు కాబట్టే వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఏదైతేనేం ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కూడా దూరం పెట్టాడు అనేది అందరికీ తెలిసిన నిజం.